విశాలాంధ్ర- పార్వతీపురం: మండలంలోని ఎమ్.ఆర్ నగరం, బాలగుడబ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వేసిన నవధాన్యాల సాగును ప్రకృతి వ్యవసాయ రీజనల్ అధికారి కె. ప్రకాష్ బుదవారం సందర్శించారు.ప్రకాష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించిన రైతులకు ఎస్ 2ఎస్ కిట్లు తయారీ చేసి సకాలంలో అందజేయాలని, ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా రైతుభరోసా కేంద్రం ద్వారా ప్రకృతి వ్యవసాయ విస్తరణ జరగాలన్నారు.ప్రతి వివోకి ఒక ఎన్పీఎం (ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కేంద్రం) షాపు ఉండాలని, కషాయాలు, ద్రావణాలు రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ మంతిని మానస, ఐసిఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.