విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గానికి చెందిన పొగాకు రామచంద్ర బుధవారం నాడు బోయ వాల్మీకి కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్గా బీసీ భవన్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం గురువారం జిల్లాలోకి రావడంతో ఆయన అభిమానులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు మరియు బోయ కులస్తులు ఇతర బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆయన బెంగళూరు నుంచి వస్తుండగా భాగేపల్లి చెక్ పోస్ట్ నుంచి దాదాపుగా 250 వాహనాలతో స్వాగతం పలుకుతూ చెక్పోస్ట్ నుంచి స్వగ్రామం అమ్మవారి పల్లి వరకు ర్యాలీగా వచ్చారు దారిలో సోమందేపల్లి నందు వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం పెనుకొండలో అంబేద్కర్ విగ్రహానికి మరియు వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అమ్మవారి పల్లి చేరుకున్న తర్వాత అభిమానులకు మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు గ్రామానికి విచ్చేసిన నాయకులు ఆయనను పూలమాలలు శాలవలతో సత్కరించారు పెనుకొండ మాజీ సమన్వయకర్త చల్లపల్లి బాబు రాజేంద్రప్రసాద్ రెడ్డి అమ్మవారి పల్లెకి వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలిపారు బోయ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా రామచంద్ర ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని ఆయన ఎంపికకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.