ముంబయి: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించే ప్రయత్నంలో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ), మెటా తమ ‘వాట్సప్ సే వ్యాపార్’ కార్యక్రమాన్ని వాట్సప్ బిజినెస్ యాప్లో 10 మిలియన్ల స్థానిక వ్యాపారులకు డిజిటల్గా శిక్షణ ఇచ్చేందుకు, నైపుణ్యాన్ని వృద్ధి చేసేందుకు విస్తరిస్తున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలలో 11 భారతీయ భాషలలో హైపర్-లోకల్ డిజిటల్ శిక్షణలతో వ్యాపారాల కోసం వృద్ధి అవకాశాలను ఆవిష్కరించేందుకు డిజిటలైజేషన్ ప్రయత్నాలను స్థానికీకరించడమే ఈ భాగస్వామ్యం కీలక లక్ష్యం. భారతదేశం వ్యాప్తంగా 40,000 వర్తక సంఘాలు, 80 మిలియన్ల వ్యాపారుల విస్తృత నెట్వర్క్తో, అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వారి దుకాణాలను సమగ్రంగా డిజిటలైజ్ చేయడం, వాట్సాప్లో వారి ‘డిజిటల్ దుకాణాన్ని’ నిర్మించుకోవడంలో సహాయపడుందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది.