ముంబయి : ఐడిబిఐ బ్యాంకు మంగళవారం ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో నికర లాభం రూ.1,224 కోట్లు కాగా, గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితంతో పోల్చితే ఇది 62% బలమైన వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ లాభం 47% వృద్ధితో రూ.3,019 కోట్లుగా ఉంది. ఎన్ఐఎం, 5.80% వద్ద నమోదు కాగా, 178 బీపీఎస్ పాయింట్ల వృద్ధితో, నికర వడ్డీ ఆదాయం ఏడాది నుంచి ఏడాదికి పోల్చితే 61% వృద్ధితో రూ.3,998 కోట్లుగా ఉంది. డిపాజిట్ ధర 4.12%గా ఉంది. సీఆర్ఏఆర్ 20.33% ఉండగా 76 బీపీఎస్ పాయింట్లతో ఏడాది నుంచి ఏడాదికి వృద్ధి చెందింది. ఆస్తులపై రాబడి 1.49% (ఏడాది నుంచి ఏడాదికి 46 బీపీఎస్ పాయింట్ల వృద్ధి), రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.63% (ఏడాది నుంచి ఏడాదికి 46 బీపీఎస్ పాయింట్ల వృద్ధి) వద్ద నమోదైంది.