చెన్నై: వందశాతం బ్రెయిలీ అక్షరాస్యత ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ థింకర్బెల్ ల్యాబ్స్ సగర్వంగా ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం ఈ తరహాలో మొట్టమొదటిసారిగా రూపుదిద్దుకున్న స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్ అయిన ‘ఆనీ స్మార్ట్ క్లాస్’ చెన్నైలోని పూనమల్లిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ విజువల్లీ ఇంపెయిర్డ్లో విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో దృష్టి లోపం ఉన్నవారి కోసం నిర్వహిస్తున్న మొత్తం 10 ప్రభుత్వ పాఠశాలల్లోనూ ‘ఆనీ స్మార్ట్ క్లాస్’లు ఏర్పాటయ్యాయి. తద్వారా 400 మంది విద్యార్థులపై ఇది తన ప్రభావం చూపుతోంది. తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ల కింద ప్రాజెక్ట్కు మద్దతు ఇవ్వడంలో సహాయం చేయడానికి భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముందుకు వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన డైరక్టరేట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఈ పైలట్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూర్చడంలో, ప్రాజెక్ట్ను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచంలోని మొట్టమొదటి స్వీయ-అభ్యాస బ్రెయిలీ అక్షరాస్యత పరికరమైన ‘ఆనీ’ ‘పిల్లల అభిజ్ఞా వికాసానికి కీలకమైన అంశమైన ఫౌండేషన్ లెర్నింగ్పై దృష్టి పెడుతుంది.