ఆంధ్రప్రదేశ్లో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ చేస్తూ వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ఇప్పుడు తాజాగా, మరికొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.