విశాలాంధ్ర – ఎన్ పి కుంట : పర్యావరణ పరిరక్షణ కాపాడటమే అందరి బాధ్యతని తాసిల్దార్ నరేంద్ర కుమార్, ఎంపీడీవో ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం
మండల కేంద్రం మాలపల్లి మెట్ట వద్ద బోటికొండలో నూతనంగా ప్రారంభకానున్న శ్రీ వైకుంఠ నారాయణస్వామి దేవాలయం పరిసరాల ప్రాంతంలో పలు రకాల ఆయుర్వేదిక మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక వృక్షాన్ని నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
పకృతిని ప్రేమించండి పర్యావరణా న్ని రక్షించాలని వృక్షాన్ని రక్షిస్తే వంద రెట్లు తిరిగి ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.