ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆగస్టు 1వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి సందర్భంగా గరుడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు,వైస్ చైర్మన్ కుండా చౌడయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగానే ధర్మవరం పట్టణంలో కూడా గత కొన్ని నెలలుగా ఈ గరుడోత్సవ కార్యక్రమాన్ని పౌర్ణమి రోజున నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 1వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు దాతలు, అర్చకులు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ గరుడ ఉత్సవమును పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా నిర్వహిస్తున్నామని, గరుడ సేవ దాతలుగా బండ్లపల్లి శోభ శ్రీ,బండ్లపల్లి వెంకట జయ ప్రకాష్ లు.. ధర్మవరం వారు వ్యవహరించనున్నారని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.