Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉత్తుత్తి ప్రకటనలు… ఉత్తుత్తి కాలనీలు….

విశాలాంధ్ర -కొయ్యలగూడెం: ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న ఆర్భాటపు ప్రకటనలు తప్ప నిరుపేదలకు కేటాయిస్తున్న జగనన్న కాలనీ లు నేటి వరకు అసంపూర్తిగానే ఉన్నాయని జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట రవి విమర్శించారు. శనివారం కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో తోట రవి ఆధ్వర్యంలో కొయ్యలగూడెం మండల జన సైనికులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ అధికారం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ జగనన్న కాలనీల నిమిత్తం రూ.89 వేల కోట్లు కేటాయించాము అని చేప్పుకోవడమే తప్ప ఎక్కడ ఇల్లు కట్టిన దాఖలాలు లేవని ఆరోపించారు
భూములను అధికార నాయకులు అమ్ముకుంటున్నారని, ఇచ్చిన భూములు వర్షాకాలంలో నదుల వలే తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నించారు.ఈ సమస్యను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపేదలకు ఇల్లు,వైద్యం,విద్యా,త్రాగునీరు అందాలంటే జనసేన అధికారంలోకి వస్తే మాత్రమే అవుతుందని, ఈ చేతకాని వైసీపీ ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రజలకు కష్టాలు తప్పవని ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ,జన సైనికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img