విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మండలానికి ఇటీవల నూతన మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శంకర్ నాయక్ ను సోమవారం మండల అగ్రి చైర్మన్ కొండలరాయుడు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు కొండలరాయుడు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఉంచుతూ పొలంబడి ఖరీఫ్ సీజన్ కు అవసరమైన రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాలని సకాలంలో వర్షాలు పడనందున ప్రధానమైన విత్తనాలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.