ముంబై: భారతీయ అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన ఫండ్ హౌస్లలో ఒకటైన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ (ఎల్ఐసీ ఎంఎఫ్), ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ (ఐడీబీఐ ఎంఎఫ్) పథకాల టేకోవర్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ విలీనం జూలై 29, 2023 నుండి అమలులోకి వచ్చింది. ఎల్ఐసీ ఎంఎఫ్ తన ఉత్పత్తి ఆఫరింగ్ను బలోపేతం చేయడం, వైవిధ్యపరచడం, తమ కార్యకలాపాలను విస్తరించడం, నిర్వహణలో ఉన్న ఆస్తుల(ఏయూఎం)ను పెంచడం ద్వారా దేశంలో ప్రముఖ ఎంఎఫ్ హౌస్గా అవతరించడం కోసం ఎల్ఐసీ ఎంఎఫ్ మిషన్కు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టింది. జూన్ 30, 2023 నాటికి ఎల్ఐసీ ఎంఎఫ్ వద్ద రూ. 18,400 కోట్ల ఏయూఎం ఉంది. ఐడీబీఐ ఎంఎఫ్ వద్ద రూ. 3,650 కోట్లు ఏయూఎం ఆస్తులున్నాయి.