విశాలాంధ్ర – సీతానగరం : సీతానగరం ఆనకట్ట ద్వారా సాగునీరు సక్రమంగా పంట పొలాలకు వెళ్లేందుకు ఆనకట్టపరిదిలోని కాలువల్లో పేరుకుపోయిన మట్టిదిబ్బలు, పూడికలు, ఇసుక దిబ్బలను జేసిబితో తొలగించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆనకట్టనుండి సాగునీరు దిగువకు రాకపోవటంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న అంశాన్ని ఎమ్మెల్యే జోగారావు దృష్టిలోనాయకులు, రైతులు పెట్టిన వెంటనే స్పందించి ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతంగా ప్రారంభించారు.ఆనకట్టలోఉన్నకాలువాల్లో ఉన్న జంగిల్, మట్టి దిబ్బలను తీయించి రైతులకు నీరందించే దిశగా పనులు చేస్తున్నారు.ఎమ్మెల్యే ఆదేశాలు మేరకు మాజీ సీతానగరం ఆనకట్ట సంఘం అధ్యక్షుడు తెంటు వెంకట అప్పలనాయుడు దగ్గరుండి పనులను జేసిబి యంత్రంతో చేయిస్తున్నారు. ఈకార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ సీడిసి ఛైర్మన్ ఎన్ రామకృష్ణ, సర్పంచు అధికారి నారాయణరావు, చినబోగిల సర్పంచ్ కురమాన రాధశ్రీనివాసరావులు పాల్గొన్నారు. రైతులు,నాయకులు ఎమ్మెల్యే జోగారావుకు కృతజ్ఞతలు తెలిపారు.