విశాలాంధ్ర,సీతానగరం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంప్రదించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దాసరి త్రినాధరావు తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.అడ్మిషన్లకు ఈనెల 17 గడువుతేదీ అని ఆయన చెప్పారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఈసి సాదారణ కోర్సులతోపాటు ఎంపిహెచ్ డబ్ల్యు (ఫీమేల్), సిఈటి, ఎంఅండ్ ఏఈటి, ఓఏఎస్ వొకేషనల్ కోర్సులలో సీట్లు ఉన్నందున అడ్మిషన్లకు సంప్రదించాలని కోరారు.కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు, లాబ్,పలితాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విధ్యార్ధులు జాయిన్ కావాలని కోరారు.