లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కఠేరియాకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2012లో టోరెంట్ పవర్ కంపెనీ కార్యాలయం విధ్వంసం కేసులో ఆయనకు ఈ మేరకు శిక్ష పడిరది. సెక్షన్ 147 కింద రెండేళ్లు, సెక్షన్ 323 కింద ఏడాది శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై కఠేరియా స్పందిస్తూ కోర్టు నిర్ణయంపై అప్పీల్ చేసుకునే హక్కు ఉన్నందున పై కోర్టుకు వెళతానని చెప్పారు. యథాప్రకారమే కోర్టుకు వెళితే తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. ఇటావా నియోజకవర్గ ఎంపీ రామ్ శంకర్ 2014 నుంచి 2016 జులై వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. రక్షణ, సంప్రదింపుల కమిటీ, హోంశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా కఠేరియా ఉన్నారు.