బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్3 దశలవారీ పురోగతిని కొనసాగిస్తోంది. తాజాగా మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. భూకక్ష్య నుంచి ట్రాన్స్ లూనార్ కక్ష్యలో ప్రయాణం సాగించిన చంద్రయాన్
3 ప్రస్తుతం చంద్రుని కక్ష్యకు చేరింది. ఇకపై చండ్రుడి చట్టూ చక్కర్లు కొట్టనుంది. శనివారం రాత్రి 7 గంటలప్పుడు చంద్రుడి కక్ష్యలోనికి చంద్రయాన్3 ప్రవేవించినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రక్రియ బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్’ పర్యవేక్షణలో సాగిందని, 18 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్
3 ఉంటుందని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే మూడిరట రెండొంతుల ప్రయాణాన్ని చంద్రయాన్`3 పూర్తి చేసుకుంది. అంతా సజావుగా జరిగితే 23వ తేదీన చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. ఈ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 ల్యాండిరగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొనడంతో అందులోని వ్యవస్థలు పని చేయలేదు. కానీ ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా దానిని మెరుగుపర్చారు. చంద్రయాన్-3ని జులై 14న ప్రయోగించిన విషయం విదితమే.