రూపా రాజా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం మండలం చేనేత పరిశ్రమకు ఆదిమూలంగా ఉందని, ధర్మవరంలో నేసిన చీరలు ఇప్పటికే దేశంలో రెండో స్థానంలో ఉన్నాయని, ఇటువంటి చీరలను గుర్తించి, చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించినప్పుడే చేనేత పరిశ్రమ అభివృద్ధిలోకి రాగలదని మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో గల, పిసిఎంఆర్. పాఠశాల చైర్మన్. హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం చైర్మన్ హర్షవర్ధన్, డైరెక్టర్స్ రూప రాజా కృష్ణ,జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటి అని తెలిపారు. చేనేత పరిశ్రమ వేలాదిమందికి, కులాలకు అతీతంగా ముఖ్యమైన జీవనోపాధిగా నేడు నిలవడం గర్వకారమన్నారు. అనంతరం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగంపై వక్తుత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించి,ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.