మండల వ్యవసాయశాఖ అధికారి హేమంత్ భరత్ కుమార్
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : రాబోయే రబీ సీజన్లో ప్రతి ఒక్క రైతుభరోసా కేంద్రం సిబ్బంది తప్పనిసరిగా పంట కొత్తప్రయోగాలు సక్రమంగా నిర్వహించాలని మండలవ్యవసాయశాఖ అధికారి ఎం.హేమంత్ భరత్ కుమార్ అన్నారు.గురువారం మండలంలోని వలేటివారిపాలెం రైతు భరోసా కేంద్రం నందు మండలంలోని గ్రామ వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకులకు పంట కోత ప్రయోగాల మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పై శిక్షణా కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం.హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయ గణాంక అధికారి కృష్ణవేణి, కందుకూరు ఉద్యానవన శాఖ అధికారి పి .బ్రహ్మ సాయి హాజరైనారు.ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్లో ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రం సిబ్బంది తప్పనిసరిగా పంట కొత్త ప్రయోగాలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు, మరియు ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు ఈ పంట నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.అనంతరం సహాయ గణాంక అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ పంట కోత ప్రయోగాలు చేయవలసిన పద్ధతి మరియు దాని యొక్క ప్రాముఖ్యత రైతు భరోసా కేంద్రం సిబ్బందికి వివరించారు అనంతరం ఉద్యానవన శాఖ అధికారి పి. బ్రహ్మ సాయి మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ద్వారా అమలుపరిచే పథకాల గురించి వివరించారు మరియు డ్రిప్పు స్ప్రింక్లర్లు కొరకు రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలంలొని గ్రామ వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకులు పాల్గొన్నారు.