విశాలాంధ్ర ధర్మవరం:: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ లో రెండవ, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు3,5 సెమిస్టర్ పరీక్షల ఫీజులు జనవరి 17 లోపు చెల్లించాలని కోఆర్డినేటర్ కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ మూడవ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి ఉంటాయని, 5 వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు స్థానిక కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించవచ్చునని తెలిపారు.