మనం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గౌతమ్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ విశాఖ సాయి దుర్గ ఆసుపత్రులు వెంటిలేటర్ పై ఉన్న క్యాన్సర్ రోగికి మనం ఫౌండేషన్ ద్వారా సోషల్ మీడియా వేదికగా సేకరించిన విరాళం 10,707 రూపాయలను ఆ వ్యాధిగ్రస్తురాలు రాము (44) అందజేయడం జరిగిందని మనం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెద్దిరెడ్ల గౌతమ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా క్యాన్సర్, లశీగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న రాము విశాఖలోని సాయి దుర్గ ఆసుపత్రిలో ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారన్నారు. శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బులు లేక బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ వంతుగా ఆమెకు ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించడం జరిగిందన్నారు. సేకరించిన10,707 రూపాయలు విరాళంగా వచ్చిందన్నారు. ఈ విరాళాన్ని రోగి కుటుంబానికి అంద చేయడం జరిగిందన్నారు. ఈ విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ పెద్దమనసుతో ముందుకు వచ్చి తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన కోరారు.