- డిఎంహెచ్ఓ ఈ.బి.దేవి
విశాలాంధ్ర- రాప్తాడు : జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ ఈబీదేవి సూచించారు. మండలంలోని గొందిరెడ్డిపల్లిలో జరుగుతున్న
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూశుక్రవారం 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతున్నదని.. భవిష్యత్తులో జరగబోవు హెల్త్ క్యాంప్స్ ను కూడా ఆయా ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు జగనన్న ఆరోగ్య శిబిరాలను సందర్శించి వైద్య సేవలు పొందాలని. మెరుగైన వైద్యసేవలు అవసరమైన వారిని క్యాంపులో డాక్టర్స్ రెఫర్ చేస్తారని..వారికి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఖర్చయ్యే ఏ
వ్యాదులకైనా ఉచితంగా చికిత్సలు అందుతాయన్నారు.క్యాంప్ నిర్వహణ, రిజిస్ట్రేషన్ కౌంటర్ను సందర్శించి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు, కేస్ షీట్ డౌన్లోడ్ ఎలా జరుగుతోందో… స్పెషలిస్ట్ డాకర్లు ఎంతమంది హజరయ్యారో పరిశీలించారు. యాప్లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అని ఆరోగ్యమిత్ర, ఎఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లతోపాటు సీహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్ అరుణ, నరసింహులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.