విశాలాంధ్ర,పార్వతీపురం : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ జిల్లా స్థాయి చిత్ర లేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు రెవిన్యూ డివిజనల్ అధికారి కె హేమలత తెలిపారు. సోమవారం ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. “ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత” అను అంశం పై జిల్లా స్థాయి చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈపోటీలు 25న ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు జిల్లా కలక్టరు కార్యాలయ ప్రాంగణంలో జరుగుతాయని అన్నారు. పోటీలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఆసక్తిగల పౌరులు పాల్గొనవచ్చని తెలిపారు. చిత్ర లేఖన పోటీలకు సంబందించి కాన్వాస్ పేపర్ ను సరఫరా చేయడం జరుగుతుందని, ఇతర సామగ్రిని పోటీలో పాల్గొంటున్న విద్యార్థులు, అభ్యర్థులు తీసుకురావాలని తెలిపారు.