విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణమునందు సోమవారం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని 500 సంవత్సరాల హిందువుల కల 123 కోట్ల జనాభా ఆశయం నెరవేరినందున, శ్రీ రామ చంద్రుడు కొలువు తీరుతున్న శుభ సందర్భంగా పట్టణంలోనీ ఎన్టీఆర్ సర్కిల్ నుండి రామలయం వరకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రామాలయంలో పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ టిడిపి నాయకులు కార్యకర్తలు, శ్రీరామ భక్తులు తదితరులు పాల్గొన్నారు.