విశాలాంధ్ర -ఆనందపురం : మండలంలో బొడ్డపాలెం ప్రభుత్వ పాఠశాల లో ఐద్వా, పాఠ శాల సిబ్బంది తో కలిసి ప్రతి హృదయంలో రాజ్యాంగం అనే నినాదం తో విద్యార్థుల తో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.అనంతరం ఐద్వా నాయకురాలు k.నాగరాణి ,ఉపాద్యాయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎంతో విశిష్టమైనది,అత్యున్నత విలువలతో కూడినది.ప్రజలు కుల, మత, భాషా,లింగ,ప్రాంత జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగం పునరుద్ఘాటించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,సమన్యాయం,సమాన అవకాశాలు ,సమగ్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా ఆచరించేలా రూపొందించారు.ప్రాథమిక హక్కులు,ప్రాథమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలతో దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పింది. నేటి బాలల్లో చిన్నప్పటి నుంచే రాజ్యాంగం విలువలు పెంపొందించటానికి ప్రజలంతా ఒక్కటే అనే భావనను కల్పించుటకు,మనుషుల మధ్య ఉన్మ సామాజిక మరియు ఆర్థిక అంతరాలు మనుషులను దూరం చేయకూడదని బాలల్లో సమతా భావనను పెంపొందించాలని ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దుర్గ,రామలక్ష్మి తది తరులు పాల్గొన్నారు.