గణతంత్ర దినోత్సవం నాడు కూడా విచ్చలవిడిగా మద్యం మాంసం విక్రయాలు….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా): తే. 26.1.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరంలో భారత గణతంత్ర దినోత్సవం రోజైన శుక్రవారం నాడు మద్యం మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. నిషేధిత రోజులైన స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం గాంధీ జయంతి రోజుల్లో మద్యం మాంసం విక్రయాల బహిష్కరణ నిబంధనలను ఉల్లంగిస్తూ విచ్చలవిడి మద్యం ఏరులై పారిస్తున్నారు. అరికట్టవలసిన ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తుండటంతో పాన్ షాపులు సైతం మద్యం గొలుసు దుకాణాలగా మారాయి. తక్షణమే మద్యం గొలుసు దుకాణాలను అరికట్టవలసిందిగా ప్రజా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.