అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడంలో విఫలమవుతున్న పోలీస్ యంత్రాంగం
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.01.02.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఖండేపల్లి గ్రామంలో గురువారం జరిపిన తీర్థ మహోత్సవంలో బహిరంగంగా నిషేధిత గుల్లాటలు, కోడి పందాలు జూదం యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగకు ముందు అసాంఘిక నిషేదాజ్ఞలు ప్రకటించినను, చుట్టుపక్కల గ్రామాల్లో తీర్థాలు పేరుతో జరుపుతున్న గుళ్ళాటలు, జూదం, కోడి పందాలు నియంత్రి0చడంలో పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో ప్రజల శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేగాక కోడి కత్తులతో పాత పగలు, ప్రతీకారం తీర్చుకుంటున్నారు. నిషేదిత అసాంఘిక కార్యకలాపాలను, పేకాటలను పోలీసులు సకాలంలో పట్టించుకోపోవడంతో అధికారులు జిల్లా ఎస్పీ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. గులాటలు నిషేధించినప్పుడు కూడా యధావిధిగా కొనసాగుతున్నాయి.