విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని ఎర్రగుంట లో గల 25వ సచివాలయంలో ఈ ఆర్ ఓ గా విధులు నిర్వహిస్తున్న శిరీష జన్మదిన వేడుకలను అవార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ సచివాలయాలలో గల ఉద్యోగస్తులు అందరూ కూడా నిరంతర కృషితో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని, ఇందులో భాగంగా వీఆర్వో శిరీష జన్మదిన వేడుకలను సచివాలయంలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థను మరింత మెరుగుపరిచేతి సెలవు సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని తెలిపారు. తదుపరి కేక్ కట్ చేసి కౌన్సిలర్ తో పాటు సచివాలయ ఉద్యోగులు ఈఆర్ఓ శిరీషకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి శిరీష మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలు తల్లిదండ్రులతో సమానమైన సచివాలయంలో నడుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని, మరిన్ని సేవలు మా వార్డు ప్రజలకు నిరంతరం సేవలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.