విశాలాంధ్ర – ధర్మవరం: ఆశా వర్కర్ల యూనియన్ కు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మరో మారు తన ఉదా రతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ కు తన వంతుగా 50వేల రూపాయల విరాళాన్ని అందించారు. అనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ఆశా వర్కర్ల డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన ఆశా వర్కర్లు ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టా రాణి విషయం తెలుసుకున్న తాను ఈ ఆందోళన కార్యక్రమాలకు ఖర్చులకోసం విరాళాన్ని అందించినట్లు వారు తెలిపారు. అనంతరం ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.