ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని ఆర్డిఓ వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం రాజకీయ పార్టీ ప్రతినిధులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా సార్లు సమావేశాలు జరిగిన మా సమస్యలు పరిష్కారం కాలేదని వారు వాపోయారు. పగటి బందీగా పారదర్శకంగా జరిగితే గాని సమస్యలు తీరవని వారు వాపోయారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ఇకనుంచి అటువంటి సమస్యలు ఉండవని తప్పక బిఎల్ఓ లచే పారదర్శకత్వం కూడినటువంటి విచారణను నిర్వహించి, అందరికీ న్యాయం చేకూర్చుతామని హామీ ఇచ్చారు.5/1/23 నుంచి 22/1/24 వరకు ఫారం-6 21,136, ఫారం-7 లో 15,867, ఫారం-8 లో 16,406 వచ్చిన క్రైమ్ లను పూర్తి దశలో విచారణ జరిపి కంప్యూటర్లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగా వచ్చిన క్లైమూలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ఓటు హక్కు కల్పించే విధంగా తాము కృషి చేస్తామని తెలిపారు. మృతులు, బదిలీలు, డబుల్ ఓట్లు, తొలగింపులు వీటన్నింటి పైన పారదర్శకతో కూడిన పనులను బిఎల్వోల చేత నిర్వర్తించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల పూరోభివృద్ధికి అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు నమోదు చేసుకొని ఓటును పొందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్ ,ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీదేవి, సిబ్బంది రాజకుమార్, వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.