సిఐటియు ప్రధాన అయూ బు ఖాన్
విశాలాంధ్ర – ధర్మవరం:: కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా, చర్చలకు పిలవకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలను అణిచి వేసే ప్రయత్నం చేయడం, పోలీసులతో ముందస్తుగా అరెస్టు చర్యలు దారుణమని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆయుభ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో జరిగిన మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మె సందర్భంగా మంత్రివర్గం ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు జీవో ల రూపంలో ఇవ్వనందున మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందర మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్మిక సంఘం పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ సమాచారాన్ని అందుకున్న ప్రభుత్వం పోలీసులను ఉసుగలుపుతో కార్మిక నాయకు లైన ఎం. బాబు, బి. ప్రసాదులను తెల్లవారుజామునే ఇళ్లకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేసి, స్టేషన్కు తరలించడం దారుణమని తెలిపారు. ఇది దుర్మార్గమైన చర్య అని తెలిపారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.