విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని సాంస్కృతిక మండలి వారి సౌజన్యంతో అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జ్ఞాపకార్థం సంగీత విభావరి అనే కార్యక్రమాన్ని సభాధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, ముఖ్య అతిథి సోలిగాళ్ళ వెంకటేశులు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించుకున్నారు. కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటల కచేరి కార్యక్రమం అభిమానుల్ని ముగ్ధుల్ని చేసింది. వాక్యతగా హిందీ పండిట్ వేణుగోపాల్ వ్యవహరిచంద్ర తీరు అందరిని ఆకర్షింప చేసింది. గాయని గాయకులుగా డీజే ఆర్కెస్ట్రా- షఫీ, ఏఎస్ఐ- అనంతపురం శ్రీరాములు, పూజారి రామాంజనేయులు, లింగం వెంకటేశులు, పులిచెర్ల శ్రీనివాసులు, బండారు మురళి, సింగర్ జ్యోతి- అనంతపురం, సింగర్ లక్ష్మీ చౌదరి- ధర్మవరం, వీరందరూ పాడిన పాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ వినోద సంతోషాన్ని పంచుకున్నారు. సత్రశాల ప్రసన్న కుమార్, సోలిగాళ్ల వెంకటేశులు, బాలం శ్రీనివాసులు, రంగనా నాగభూషణము మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక మండల లో నిర్వహించుట సంతోషించదగ్గ విషయమని, ప్రతి సంవత్సరము ఇటువంటి కార్యక్రమాలు ఎస్పీ బాలసుబ్రమణ్యం జ్ఞాపకార్థం నిర్వహించుట అభినందించదగ్గ విషయమని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటల్లో సింగర్ షఫీ పాడిన భైరవ దీపం సినిమాలోని శ్రీ తుంబర నారద అనే పాట ప్రేక్షకులను అబ్బురపరిచింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం పట్ల ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిమానులు, అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.