Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ .. కేశినేని నాని : బోండా ఉమా

రెండుసార్లు టికెట్ రావడం వారి దయేనని వెల్లడి

విజయవాడ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నాయకులు బోండా ఉమా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని, అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు. కేశినేని నాని తీరు వల్ల పార్టీపైనా విమర్శలు వచ్చాయని.. కేశినేనికి రెండుసార్లు టికెట్ రావడం వెనుక ఆ నేతలు కీలకంగా వ్యవహరించారని అన్నారు. కేశినేని నాని ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను మీడియా ముందు రిలీజ్ చేశారు.
కేశినేని నానిని అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్‌ అంటూ బోండా ఉమా సెటైర్లు వేశారు. 2014లో అప్పటి టీడీపీ నేత సుజనా చౌదరి కేశినేని నానికి ఎంపీ టికెట్ ఇప్పించారని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తానంటే కేశినేనిని చంద్రబాబు కూడా నమ్మారన్న బోండా ఉమా.. అప్పటి ఎన్నికల్లో కేశినేని ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదన్నారు. కేశినేని నాని తరుఫున సుజనా చౌదరి ఖర్చు పెట్టారని చెప్పారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు దయతో ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. 2019లో మాత్రం చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి టికెట్ సంపాదించుకున్నాడని విమర్శించారు. అప్పుడు కూడా లోకేష్ కారణంగా కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ వచ్చిందన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా కూడా.. టీడీపీ కోసం రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు.2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని, అప్పులు తగ్గించుకున్నారని బోండా ఉమా ఆరోపించారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నాని అలవాటనీ, కేసుల భయంతోనే కేశినేని ట్రావెల్స్‌ను మూసివేశారని ఆరోపించారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపించారు. 2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ 37 కోట్లు, అప్పులు 66 కోట్లు అయితే.. 2019 నాటికి ఆస్తులు కాస్తా రూ.66కోట్లు, అప్పులు రూ.51కోట్లుగా అయ్యాయని చెప్పారు.2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో కేశినేని నాని ఆస్తులు వందశాతం పెరిగాయని.. దీనివల్ల టీడీపీపైనా విమర్శలు వచ్చాయని బోండా ఉమా చెప్పారు.ప్రస్తుతం జగన్ దొడ్డిలో వైసీపీ కుక్కలా మారి కేశినేని ఇష్టానుసారం మాట్లాడుతున్నాడన్న బోండా ఉమా.. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు.. కేశినేని నాని ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. లేకుంటే తగిన రీతిలో సమాధానమిస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img