సుమారు 5 నుండి 10 కోట్ల రూపాయలు వ్యయంతో దక్షిణ అయోధ్య సంకల్పంతో సమారంభం …విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.13.02.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం దుద్దుపాలెం మెట్ట పై సుమారు 5 నుండి 10 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీరామ పంచాయతన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణానికి సకల సన్నాహాలు ప్రారంభం చేశారు. 108 అడుగులు పొడవు, 81 అడుగులు వెడల్పు నిడివితో మూడు అంతస్తుల్లో, దక్షిణ అయోధ్య గా చేయ సంకల్పంతో కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు, భూమి పూజతో ప్రారంభం చేసి, 3 ఏర్లుతో ఏరువాక దుక్కి చేసి నవధాన్యములు జల్లి నిర్మాణ పనులు ప్రారంభం చేశారు. మొదటి అంతస్తులో పట్టాభి రాముడు, రెండవ అంతస్తులో శ్రీ సీతారాములు, ఊర్మిళ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, సువర్చల సహిత అభయ ఆంజనేయుడు కళ్యాణ మూర్తులు, మూడవ అంతస్తులో శ్రీ రంగ నాథుడు కొలువుండే విధంగా రూపకల్పన చేశారు. శుక్ల యజుర్వేద ఘనాపాటి రాపర్తి శ్రీరాజా నరేంద్ర శర్మ వేద సంకల్పంతో శ్రీ సీతారామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముక్కు శివరామ ప్రసాద్ రావు శర్మ దంపతులు చే భూమి పూజ ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏ.కార్తీక్ రావు, సర్పంచ్ కూర్మదాసు మాలిబాబు, గొంప అప్పలస్వామి, కొండ్రకోటి నరసింగరావు, వెంకట అప్పారావు, తులసి సూరి అప్పారావు, శ్రీను, భీమరాజు, తాతబాబు, ధర్మ ప్రచార కర్త సన్యాసి శెట్టి (శ్రీమన్నారాయణ), గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.