విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జే వి రమేష్
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్యసాయి జిల్లా) పట్టణంలోని మార్కెట్ యార్దు సబ్ స్టేషన్ యందు శుక్రవారం ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్- అనంతపురం రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జేవి. రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యుత్ అవగాహన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరవుతున్నట్లు వారు తెలిపారు. విద్యుత్ వినియోగదారుల యొక్క పరిష్కార కానీ సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు ద్వారా తెలియపరిచి, సమస్యలను పరిష్కరించుకొని చక్కటి అవకాశం కలగని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకుంటే సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయని తెలిపారు.