నేడు గ్రామీణ భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపు
వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా తమ 20 డిమాండ్ల పరిష్కారం కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఢిల్లీ ఛలో ఆందోళనలు నాలుగో రోజుకు చేరాయి. రెండు రోజుల పాటు అట్టుడికిన పంజాబ్, హరియాణా సరిహద్దులు గురువారం కాస్త శాంతించాయి. అయితే, రైతు సంఘాలు గురువారం రైల్రోకో చేపట్టడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం గ్రామీణ భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు, రెండో దఫా రైతు సంఘాల నేతలు, కేంద్రం మధ్య గురువారం సాయంత్రం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చండీగఢ్లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రైతు సంఘాల నేతలు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, శర్వాన్ సింగ్ పంథేర్ పాల్గొన్నారు. కానీ, చర్చల్లో ఎటువంటి అంగీకారం కుదరలేదు. దీంతో ఆదివారం మరోసారి చర్చలు జరపనున్నట్టు కేంద్ర మంత్రులు గురువారం రాత్రి వెల్లడించారు. అయితే, ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వ్యాఖ్యానించారు. ారైతు సంఘం లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించి, తదుపరి సమావేశం ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరపాలని మేము నిర్ణయించుకున్నాం్ణ అని ఆయన చెప్పారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్టు ఆయన తెలిపారు.చర్చలు ఫలించకపోవడంతో ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు ప్రకటించాయిి. శంభు, ఖనౌరీల వద్ద వేల మంది రైతులు, పోలీసులు మోహరించి ఉన్నారు. తాము బారికేడ్లను తొలగించేందుకు గురువారం ఎటువంటి ప్రయత్నం చేయలేదని రైతు నేతలు తెలిపారు. అటు, సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు.. శుక్రవారం నాడు గ్రామీణ భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ బంద్ని రైతు సంఘాలు అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. దేశ నలుమూలల్లోని రైతులు.. ఈ భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది