విశాలాంధ్ర-రాప్తాడు : ఈనెల 18వ తేదీన రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో ఏబీఎన్ ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాప్తాడు టిడిపి కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశాల వివరాలను ప్రజలకు తెలియజెప్పేందుకు ఫోటోలు తీస్తే దాడి వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తారా అని ప్రశ్నించారు. లక్షల మందిలో ఒక వ్యక్తిని కొడుతుంటే పోలీసులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి, మరూరు గోపాల్, గంగలకుంట రమణ, బోగినేపల్లి రమేష్, ఫక్కీర్ రెడ్డి, సల్లప్ప తదితరులు పాల్గొన్నారు.