విశాలాంధ్ర -పామిడి
(అనంతపురం జిల్లా) : చత్రపతి శివాజీ 394 జయంతి సందర్భంగా పామిడి పట్టణ పరిధిలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పట్టణ పురవీధుల్లో శివాజీ చిత్రపటాన్ని పెట్టుకొని ఊరేగించారు, అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు
ఛత్రపతి శివాజీ గారు అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ క్లాత్ స్టోర్ శ్రీనివాసరావు, టిటి నాగభూషణరావు, జోజోడే కుమార్, మంజు, టీటీ రమణరావు,పాల్గొన్నారు.