ముంబయి: దేశీయ విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది ఎయిర్ ఆసియా. ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లలో విమానాలు నడుపుతున్న ఎయిర్ ఆసియా తాజాగా తన బిగ్ సిగ్నేచర్ సేల్ క్యాంపెయిన్ని రూ. 0తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్యాంపెయిన్ ప్రధానంగా భారతదేశంలోని ప్రధాన నగరాలైన కౌలాలంపూర్, బ్యాంకాక్ లకు ఉంటున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, జైపూర్, త్రివేండ్రం, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి మలేషియా-కౌలాలంపూర్ లాంటి అంతర్జాతీయ నగరాలను ప్రయాణించండి. తద్వారా విదేశాలను చూడాలనుకుంటున్న మీ కోరికలను అతి తక్కువ ప్రయాణ ఛార్జీలున్న ఎయిర్ ఆసియా ద్వారా నెరవేర్చుకోవచ్చు. ఈ క్యాంపెయిన్ లో బుక్ చేసుకున్న సీట్లను 1 సెప్టెంబర్ 2024 నుండి 18 జూన్ 2025 వరకు ప్రయాణం చేయడానికి ఉపయోగించవచ్చు. సీట్లను బుక్ చేసుకోవడానికి, ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఎయిర్ ఆసియా యాప్ లేదా ఎయిర్ఆసియా.కామ్ని సందర్శించవచ్చు.