Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం… మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యము అని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం నాదేనని వారు స్పష్టం చేశారు. లక్ష మెజారిటీతో తాను కచ్చితంగా గెలుస్తానని తెలిపారు. ఇప్పటికే తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో బోర్లు రిపేరు చేపిస్తున్నామని, తాడిమర్రి నుంచి ప్రచారాన్ని కొనసాగిస్తూ, విద్యుత్ కోతలతో తల్లడిల్లుతున్న రైతాంగాన్ని కూడా తాను ఆదుకుంటానని వారు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలిస్తే భూముల్ని కొల్లగొడతారని తెలిపారు. ధర్మవరంలో పాలయగాల రాజ్యం వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డిని జనం బట్టలు ఊడదీసి కొట్టే రోజు దగ్గర ఉందని తెలిపారు. ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా రైతాంగం కోట్లాది రూపాయల విలువ చేసే పంటలను నష్టపోయే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని లో వోల్టేజ్ కారణంగా వందల సంఖ్యలో విద్యుత్ మోటర్లు కాలిపోతున్న పట్టీ పట్టనట్లు ఈ ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోందని కనీసం మన రాష్ట్రంలో నాలుగైదు గంటలకు కూడా కరెంటు సరఫరా కావడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు దాహం దాహం అంటూ తెల్లటిల్లి పోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ చట్టము వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని తెలిపారు. ఈ చట్టం వల్ల రైతులకు ఏమాత్రం మేలు జరగకపోగా భారీగా కీడు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణం ప్రజలకు తాగునీరు, నాణ్యమైన విద్యుత్ను 24 గంటలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిష్ రాజు, తుంపర్తి పరమేష్, బోడగల గిరిధర్, దుస్సా కృష్ణ, గొట్లురుచంద్ర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img