Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మార్చి మూడున చలో విశాఖ సింహగర్జనకు తరలిరండి

సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) – సమాన పనికి సమానv వేతన సాధన కోసం మార్చి 3న చలో విశాఖపట్నం సింహగర్జనకు పొరుగు, ఒప్పంద, రోజువారి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ పిలుపునిచ్చారు. బుధవారం చింతపల్లి, జికే వీధి మండలాల సిహెచ్ డబ్ల్యూ ల సమావేశం చింతపల్లి సిఐటియు కార్యాలయంలో జికే విధి మండల కార్యదర్శి జి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు, ఒప్పంద ఉద్యోగులకు ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. 10, 177 మంది ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేసే జీవో ని ఆహ్వానిస్తున్నామని, అయితే ప్రభుత్వం ఇచ్చిన పూర్తిస్థాయి హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. 10,177 మందికి ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్య, వైద్య, ఆరోగ్య శాఖ వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్, ఆర్టీసీ, గృహ నిర్మాణ శాఖ వంటి 26 ప్రభుత్వరంగ సంస్థలు మున్సిపల్, పంచాయతీ వంటి స్థానిక సంస్థలు కేజీబీవీ సంక్షేమం గిరిజన, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖలు, వసతి గృహాలు, మోడల్ పాఠశాలలు, ఐ టి డి ఏ లు ప్రభుత్వ రంగ సొసైటీలు, జ్యుడీషియల్, పోలీస్, సమగ్ర శిక్ష, జాతీయ ఆరోగ్య మిషన్, ఉపాధి హామీ, వెలుగు, పట్టణ ఆరోగ్యం,104, 108, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య మిత్ర, తదితర అందర్నీ నిర్దిష్ట కాలంలో రెగ్యులర్ చేసేలా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే సర్కులర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కచ్చితంగా వేతనాలు పెంచాల్సి ఉందన్నారు. ఆశా లతో పాటు సిహెచ్ డబ్ల్యూ లకు కూడా వేతనాలు పెంచాలని, ఆశలుగా మార్చాలని కోరారు. వ్యక్తిగతంగా సిహెచ్ డబ్ల్యూ లకు, ఆశలకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యక్తిగత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆశ డే నుండి 104 సచివాలయ క్యాంప్ వరకు నెలకు 5 సార్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం కి హాజరు కావలసి ఉంటుందని, వెళ్ళినప్పుడు మా చార్జీలు ఎవరిస్తారని అడిగితే సంబంధిత అధికారులు ఉద్యోగాలు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పని చేయించుకునే పద్ధతి వైద్య శాఖ అధికారులు నేర్చుకోవాలని సూచించారు. మార్చి మూడో తారీఖున విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు సామూహిక నిర్వహిస్తున్న సింహ గర్జన కు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, జికేవిది సిహెచ్డబ్ల్యులు శేషు, పద్మ, పావని తోపాటు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img