25వ వార్డ్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్
విశాలాంధ్ర – ధర్మవరం : సచివాలయలలో పనిచేసే వాలంటీర్స్ యొక్క సేవలు వెలకట్టలేనివని 25 వ వార్డు పార్థసారధి నగర్-2 కౌన్సిలర్ మేడాపురం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పార్థసారథి నగర్-2 లోని సచివాలయంలోని 17 మంది వాలంటీర్లను ఘనంగా కౌన్సిలర్ సత్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పథకాలు ప్రజల దారిన చేర్చేందుకుగాను వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ని ఉండడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ వాలంటీర్లు అందించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు వాలంటీర్స్ విశేష సేవలను అందించి మంచి మన్ననలతో పాటు మంచి గుర్తింపు కూడా పొందడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ సచివాలయం వ్యవస్థను అనుక్షణం పరిశీలిస్తూ అభివృద్ధి పాటకు దోహదపడుతున్నారని తెలుపుతూ తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయితో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.