విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో అనంతపురం కి చెందిన సిద్దిక తల సేమియా తో రక్తం తక్కువ ఉండడంతో ఓ ప్లస్ వీ బ్లడ్ కావాలని రక్త బంధం ఆర్గనైజేషన్ వారికి సమాచారం అందింది. వీరయ్య, అనిత లు వెంటనే రక్తదానం చేశారు. అనంతరం సిద్ధిగా కుటుంబ సభ్యులు వీరయ్యకు అనితకు రక్తబంధం ఆర్గనైజేషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనిత నాలుగవసారి, వీరయ్య ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేయడం జరిగిందని, రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. రక్షాబంధన్ ఆర్గనైజేషన్ చేస్తున్న ఇటువంటి రక్తదాన సేవలు పట్ల ధర్మారం ప్రజలు, అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అభినందించారు.