విశాలాంధ్ర – ధర్మవరం : రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు, ముఖ్య అతిథులు బంధనాథం వెంకటరమణ అండ్ బ్రదర్స్ వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరమును నిర్వాహకులు బీరే శ్రీరాములు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహణ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రమాదంలో అవసరమైన వారికి, గర్భిణీ స్త్రీలకు నాడు రక్తదాతలు ఇచ్చిన రక్తము పునర్జన్మను ఇస్తుందని తెలిపారు. రక్త దానములో ఎవ్వరు కూడా అపూహలకు తావు ఇవ్వరాదని తెలిపారు. అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న అని, రక్తదానముకు విలువ కట్టలేమని తెలిపారు. నాటి ఈ శిబిరంలో 42 మంది రక్తదానం నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని వారు తెలిపారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలను కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేత లోకేష్, బోనాల శివయ్య, శంకర, యుగంధర్, తొగట వీర క్షత్రియ సేవా సంఘం మాజీ అధ్యక్షులు దాసరి శ్రీరాములు, ఉమ్మడిశెట్టి ప్రసాద్, పడకేరి నాగరాజు, మేకల శివయ్య, దాసరి శివప్రసాద్, తదితరులకు పేరుపేరునా రక్తదాన శిబిర విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.