విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం పట్టణము రూరల్ పరిధిలో, ఈనెల మూడవ తేదీన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం పట్టణంలో 61 పల్స్ పోలియో కేంద్రాలలోనూ రూరల్ పరిధిలో 49 కేంద్రాలలో విజయవంతంగా 98 శాతం పూర్తి చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, రూరల్ ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తదుపరి పల్స్ పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు సిబ్బంది ఇంటింటా తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించా రానీ,ఇందులో భాగంగా పట్టణములో 285 మంది చిన్నారులకు రూరల్ పరిధిలో 74 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయడం జరిగిందని తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఈనెల 5వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.