విశాలాంధ్ర, సీతానగరం : వేసవి ఎద్దడి నివారణకు క్రాస్ ప్రోగ్రాం ఉపయోగకరమని ఎంపిపి బలగ రవణమ్మశ్రీరాములు నాయుడు, జడ్పీటీసీ మామిడిబాబ్జిలు తెలిపారు.బుదవారం వారు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో క్రాస్ ప్రోగ్రాం వాహనాన్ని జెండాఊపి ప్రారంభం చేశారు. వేసవి కాలంలో బోర్ వెల్స్ మరమ్మతులు వెంట వెంటనే చేపట్టి త్రాగునీటిసమస్యను పరిష్కారం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ ఎం ఈశ్వరరావు, పరిపాలన అధికారి ప్రసాద్, ఆర్ డబ్ల్యుఎస్ జేఈ పవణ్ కుమార్, ఈఓపిఆర్డీ కుమార్ వర్మ, పలువురు ప్రజా ప్రతినిదులు, ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది, బోర్ మెకానిక్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.