విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అయోడిన్ లోపంపై 18 మంది విద్యార్థులకు వైద్యాధికారి ఆనంద వర్ధన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయోడిన్ లోపం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అయోడిన్ లోపం వల్ల అలసట , బరువు పెరగడం అసహనం, బలహీనత వంటి సమస్యలను వస్తాయన్నారు. అయోడిన్ వలన కలిగే లాభ నష్టాలు పై విద్యార్థులకు అవగాహన సదస్సు కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఆనంద వర్ధన్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రామానుజులు, ఉపాధ్యాయులు మురళి, సంపత్ కుమార్, రమణ నాయక్ సిహెచ్ఓ నాగలక్ష్మి, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు