విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 26వ వార్డులోని ఎంజి కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయమునకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి సుప్రియ తన వంతుగా ఆలయానికి 50వేల రూపాయల విరాళాలని ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆలయాలకు విరాళము, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తము, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నియోజకవర్గంలో మంచి గుర్తింపును పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సుప్రియ కు కృతజ్ఞతలను తెలియజేశా రు.