విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ సద్గురు బం బం బాబా సేవా సమితి లో ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బత్తలపల్లి రోడ్డు, మార్కెట్ యార్డ్ ఎదురుగా గల సి ఎన్ బి గార్డెన్స్ లో సద్గురు అన్వరానంద స్వాముల వారి ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాముల వారి ఆరాధన కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయువారు తమ పేరు వయసు సెల్ నెంబర్ తో సహా నమోదు చేసుకోవలసినదిగా వారు తెలిపారు. శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి గురు కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న అని తెలిపారు. రక్తదానం ఎంతోమందికి అవసరమని, ప్రమాద సమయంలో అవసరం ఉన్నవారికి రక్తమును ఇవ్వుట, గర్భిణీ స్త్రీలకు కూడా రక్తము ఎంతో అవసరం ఉంటుందని తెలిపారు. రక్తం దానం చేయుటలో అపూహలకు తావు ఇవ్వరాదని తెలిపారు. రక్తదానం చేయువారు సెల్ నెంబర్. రాధాకృష్ణ 9866494195కు గాని, నాగార్జున 8897 2991132 గాని, చరణ్ సాయి 9063135416 కు గాని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. కావున రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ శిబిరాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు.