విశాలాంధ్ర ధర్మవరం:: స్థానిక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బిఐ బ్యాంకు 12008 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగిందని ఇందులో6,465 కోట్లు అనగా 55 శాతం బిజెపికి సంబంధించిన డిపాజిట్లు, కాంగ్రెస్కు సంబంధించి 1,135 కోట్లు అనగా 95 శాతం, తృణమూల్ కాంగ్రెస్కు 1,096 కోట్లు ఎన్నికల బాండ్లు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. కానీ నేటికీ వివరాలు సమీర్పించలేదని మండిపడ్డారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపారు. ఎస్బిఐలో 44 కోట్లు ఖాతాలు కలిగి ఉన్నాయని, 66000 ఏటీఎంలు కలిగిన పూర్తిగా కంప్యూటర్స్ కలిగిన సంస్థ సుప్రీం కోర్ట్ అడిగిన సమాచారం ఇవ్వకపోవడం విచారకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దన్న, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, ఆదినారాయణ, మారుతి, నామాల నాగార్జున, బత్తల కదిరప్ప, వెంకటస్వామి, నరసింహారెడ్డి, వెంకటరాముడు, తదితరులు పాల్గొన్నారు.