విశాలాంధ్ర ధర్మవరం:: అర్హతగల పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడమే ప్రభుత్వము యొక్క ముఖ్య లక్ష్యము అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ కాలేజీ క్రీడా మైదానంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోనే ఏ ప్రభుత్వము చేయని ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరచడం ప్రజల యొక్క అదృష్టమని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ధర్మవరంలో 13,350 మందికి ఇంటి పట్టాలు ఇవ్వగా, 6,546 మంది రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను కూడా పొందడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నియోజకవర్గ ప్రజలు మరోసారి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు మీ ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ లు షమీం బేగం, వేముల జయరామిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లు, పట్టణ వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ ఆనంద్ కుమార్, శివ, ఈఈ సత్యనారాయణ, శానిటరీ సెక్షన్, సచివాలయ ఉద్యోగులు, వార్డు ఇన్చార్జులు, వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.