శ్రీనివాస డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ రోడ్డు వద్ద గల పీవీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు మార్చి 25 నుంచి మే 5 వరకు ఎప్కెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ముసల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ఉమా జ్ఞాపకార్థం శ్రీ బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో (పీవీకే కే) పేద విద్యార్థులకు ఈ కోచింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఆసక్తి ఉన్న ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈనెల 13వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవలసినదిగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ కూడా తెలపడం జరిగిందని తెలిపారు.